September 3, 2013
బాబును కలిసిన దేశం నేతలు
ఆత్మగౌరవయాత్ర పేరుతో గురజాల
నియోజకవర్గంలో తెదేపా అధినేత చంద్రబాబు నిర్వహించిన యాత్ర పార్టీ
శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.చంద్రబాబు బస చేసిన ప్రదేశానికి సోమవారం
తెదేపా నాయకులు, మాజీ మంత్రులు హాజరయ్యారు.మాజీ మంత్రి కోడెల శివప్రసాద్,
యనమల రామకృష్ణుడు, చిక్కాల రామచంద్రరావు, కరణం బలరాం, ప్రత్తిపాటి
పుల్లారావు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, నన్నపునేని రాజకుమారి,
వర్ల రామయ్య, చంద్రబాబును ప్రత్యేక బస్సులో కలిసి ఆదివారం నాటి బస్సు యాత్ర
విశేషాలను వివరించారు. ఉదయం 10గంటల నుంచి 12గంటల వరకు బస్సులో పార్టీ
పెద్దలతో చంద్రబాబు సమీక్షా నిర్వహించారు. చంద్రబాబుతో ఫోటోలు దిగేందుకు
పిడుగురాళ్ల తెలుగుతమ్ముళ్ల ఉత్సాహం చూసిన ఎమ్మెల్యే యరపతినేని చంద్రబాబుతో
తెలుగుతమ్ముళ్ల ఫోటోలు దిగేందుకు అవకాశం కల్పించారు. చంద్రబాబు బస చేసిన
ప్రాంగణం వద్ద ఎన్నారై జానపాడు వాసి చింతలపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో
నారాయూత్ పేరుతో చంద్రబాబు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, నారాలోకేష్
ఫోటోలతో పెద్దఎత్తున ఏర్పాటు చేసిన ఫ్లెక్స్బ్యానర్లను చంద్రబాబు
ఆసక్తిగా గమనించారు.ఎమ్మెల్యేలు ధూళ్లిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు, మాజీ
మంత్రి పుష్పరాజ్, మాజీ ఎమ్మెల్యేలు జియావుద్దీన్, అనంతవర్మరాజు, సెంట్రల్
బ్యాంక్ ఛైర్మన్ ముమ్మినేని వెంకటసుబ్బయ్య, వెన్నా సాంబశివారెడ్డి,
కంచేటి శివప్రసాద్, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ వడ్డవల్లి సర్వేశ్వరరావు,
ఎల్ వి ఆర్, సయ్యద్ అమీర్అలీ, బాబావలి, పెండేల సుబ్రమణ్యం, వర్ల రత్నం,
నల్లాటి సుబ్బారావు, చింతలపూడి సీతారామయ్య, బాబు, మేకల సాంబశివరావు, దియ్యా
రామకృష్ణా, తురకా వీరస్వామి,అద్దంకి బాబు, వేముల సాంబయ్య, కోకాటి ప్రసాద్,
గుదె లక్ష్మణ్బాబు, దాచినేని సాయి, తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
5:37 AM