September 2, 2013

సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు శివప్రసాద్‌పై కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖండించారు. గుంటూరు జిల్లాలో తెలుగుజాతి 'ఆత్మగౌరవ యాత్ర'లోఉన్న ఆయన సోమవారం మాట్లాడుతూ ఇటలీ నుంచి వచ్చిన సోనియా గాంధీ భారత్‌లో తిరుగుతుంటే, భారత్ దేశంలో పుట్టిన తెలుగువాడైన శివప్రసాద్‌ను ఢిల్లీలో తిరగనివ్వరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎరిచ్చారు మీకీ అధికారం అంటూ చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మీ అంతు చూస్తామని ఆయన హెచ్చరించారు. సమస్యను పరిష్కరించడం చేతకాకపోతే గద్దె దిగాలని, ఏడాది సమయం టీడీపీకి ఇచ్చి చూడండని, రాష్ట్రం దిశ మార్చి చూపిస్తామని చంద్రబాబు సవాల్ చేశారు.