September 2, 2013

తెలుగుజాతి కోసం ఎంతవరకైనా పోరాటం : బాబు

కాంగ్రెస్‌, వైకాపాలను భూస్థాపితం చేసే వరకు తమ పోరాటం ఆగదని టీడీపీ చీఫ్‌ చంద్రబాబు తెలిపారు. తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర రెండో రోజు సందర్భంగా సత్తెనపల్లిలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌లో కలిసిపోయిందన్నారు. తామ యూ టర్న్‌ తీసుకున్నామంటున్నారని, తనది ప్రజా టర్నే తప్పు వేరే టర్న్‌ కాదని ఆయన పేర్కొన్నారు. తెలుగు ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడుతానని ఆయన స్పష్టం చేశారు.