September 2, 2013

బాబు మాటలు అర్ధం కాకపోతే ..రండి మావద్దకు:రేవంత్

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగాలను ప్రశ్నిస్తున్న లగడపాటి, అనంత వెంకటరామిరెడ్డి, హరీష్ రావు, పొన్నం,కడియం తదితరులకు ఎన్.టి.ఆర్.ట్రస్టులో ఉచిత చికిత్సలు చేయిస్తామని టిడిపి అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి అన్నారు. సీమాంధ్ర ప్రజల ఆందోళనను, ఆ సమస్యల పరిష్కారం కోసం తాను ప్రయత్నిస్తానని చంద్రబాబు చెబుతున్నారని,అది అర్ధం చేసుకోకపోతే కంటి ఆపరేషన్లు, చెవి ఆపరేషన్లు చేయిస్తామని అన్నారు.సీమాంధ్రులను రెచ్చగొట్టే విధంగా కెసిఆర్ మాట్లాడినందువల్లే ఈ పరిస్థితులు వచ్చాయని ఆయన అన్నారు.సీమాంధ్రుల సమస్యలపై వివరణ ఇవ్వవలసిన బాధ్యత కెసిఆర్ పై లేదా అని ఆయన ప్రశ్నించారు.