September 2, 2013

చిరంజీవి ఎక్కడ-రాహుల్ ముద్దపప్పు

ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి చిరంజీవి పై విరుచుపడ్డారు. సినిమా డైలాగులు చెప్పిన చిరంజీవి ఏమైపోయాడని ఆయన తన రెండో రోజు ఆత్మగౌరవయాత్ర సందర్భంగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు టిఆర్ఎస్, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ల పరిస్థితి కూడా అంతేనని ఆయన అన్నారు.తెలుగు జాతిపై కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆయన ద్వజమెత్తారు. కాగా రాహుల్ గాందీ ముద్దపప్పు అని కూడా ధ్వజమెత్తారు. సోనియాగాంధీ అవగాహన లేకుండా వ్యవహరిస్తూ దేశానికి నష్టం చేస్తున్నారని ఆయన అన్నారు.