September 2, 2013

కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు

చంద్రబాబు రాకతో దాచేపల్లి మండలం పసుపు వర్ణంగా మారింది..పొందుగుల నుంచి దాచే పల్లి వరకు రోడ్డుకు ఇరువైపులా పసుపు రంగు జెండాల రెపరెపలతో... బ్యానర్లతో నిండిపోయింది. వ్యవ సాయ పనులు ముమ్మరంగా వున్నా చంద్రబాబును చూసేం దుకు..ఆయన ప్రసంగం ఆలకించేందుకు తెలుగు తమ్ముళ్లు, మహిళలు అధిక సంఖ్యలో ఆదివారం తరలిరావడంతో పొందు గల,దాచేపల్లిలో జరిగిన బాబు బహిరంగ సభలు కిక్కిరిసాయి. సమె ౖక్యాంధ్ర వాదులు సభను అడ్డగిస్తారని ముందుగా ప్రచారం జరిగినా ఎలాంటి అడ్డంకులు లేకపోవడం పార్టీ కేడర్‌లో ఆత్మస్థైర్యం నింపింది. దాచేపల్లి,మాచవరం,పిడుగురాళ్ల,కారంపూడి, నకరికల్లు,రాజుపాలెం, నర్స రావుపేట,చిలకలూరిపేట,వినుకొండ,మాచర్ల, గురజాల, రెంట చింత ల,దుర్గి,వెల్తుర్థి తదితర మండ లాల నుంచి కార్యకర్తలు, అభిమా నులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఎండను లెక్క చెయ్యకుండా బాబు కోసం ఎదురు చూపులు
మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి మీద నిప్పులు కురిపిస్తున్నా పట్టు వదలని విక్రమార్కుడి మాదిరి కార్యకర్తలు బాబు రాక కోసం ఎదరుచూశారు. తమ ప్రియతమ నేత ప్రసంగం ఆలకించేందుకు పోటీ పడ్డారు. తొలుత మధ్యాహ్నం 11గంటలకు సభ ప్రారంభ మౌతుందని ఆశించినా, రెండు గంటలకు బాబు ప్రసంగించారు.
అధిక సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు
గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బాబు ప్
రారంభించిన ఆత్మగౌరవం యాత్ర నియోజక వర్గంలో సూపర్ సక్సెస్ కావడంతో తెలుగు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేశారు. పొందుగల నుంచి దాచేపల్లి వరకు అభిమానులు తాకిడితో రోడ్లు నిండిపోయాయి.వేల సంఖ్యలో సభకు భారీగా తరలి రావడంతో నాయకులు ఉద్రేకంగా తమ ప్రసంగాలు చేశారు. .ఆయా కార్యక్రమాలలో పార్టీ నాయకులు గుంటుపల్లి నాగేశ్వరరావు, తంగెళ్ల శ్రీనివాసరావు,పగడాల భాస్కరరావు, అక్కినపల్లి బాలయ్య, వేముల తిరుమల కుమార్, మామిడి చంద్ర శేఖరరావు,తవ్వా శ్రీనివాస రావు, కుర్రి శంకరరెడ్డి,పురంశెట్టి అంకులు,నెల్లూరి వెంకటేశ్వర్లు, షేక్ సైదా,జంగిలి వెంకటేశ్వర్లు, సాదినేని కోట్వేశర రావు,నర్రా పుల్లయ్య, కోగంటి శివన్నా రాయణ,ఆవుల సైదులు, కోటేశ్వర రావు,వెలిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.