September 2, 2013

నా వెనుక ఎవరో ఉన్నారన్నది అవాస్తవం : హరికృష్ణ

ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో తన వెనుక ఎవరో ఉన్నారని వస్తున్న వార్తలు అవాస్తవమని టీడీపీ నేత హరికృష్ణ తెలిపారు. పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద హరికృష్ణ నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీఏసీ చైర్మన్ పదవి దక్కకపోవడంతో వైసీపీలో చేరుతామన్నవారు అధినేతకు తనపై విమర్శలు చేశారని ఆయన అన్నారు.

గడ్డితిని మాట్లాడాల్సిన అవసరం లేదని, తనది నీతివంతమైన రాజకీయమన్నారు. తన తండ్రి ఆశయం కోసం పోరాడుతానని హరికృష్ణ స్పష్టం చేశారు. రాహుల్‌ను ప్రధానిని చేసేందుకే రాష్ట్ర విభజన అని, సోనియా స్వార్థానికి రాష్ట్రం బలి అవుతోందని ఆయన ఆరోపించారు. తెలుగువారి కోసం పార్లమెంటులో పోరాడుతున్నందుకే బాలకృష్ణ కుమార్తె వివాహానికి హాజరుకాలేదని వివరించారు.