September 2, 2013
టీడీపీ ఎంపీలపై నోరుపారేసుకున్న ఎంపీ సందీప్
సీమాంధ్ర టీడీపీ ఎంపీలపై కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ సభలో నోరుపారేసుకున్నారు. టీడీపీ ఎంపీలు ఇందిరాగాంధీ మాస్క్ పెట్టుకుంటే చంపేస్తానని, ఢిల్లీలో లేకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎంపీ సందీప్ దీక్షిత్కు టి.కాంగ్రెస్ ఎంపీలు వత్తాసు పలికారు. దీనిపై టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సందీప్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీ నామా నాగేశ్వర్రావు ఎంపీ సందీప్పై స్పీకర్కు ఫిర్యాదు చేశారు.
Posted by
arjun
at
6:38 AM