July 6, 2013

కోదండరాం తెలంగాణ ద్రోహి : ఎర్రబెల్లి

కోదండరాం తెలంగాణ ద్రోహి అని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ నాడు కాంగ్రెస్ నేతలను తరమి కొడతానన్న కోదండారం నేడు తిండి కోసం కాంగ్రెస్ నేతల ఇంటికి వెళ్లారన్నారు. రాష్ట్రం విడిపోయినా రెండు ప్రాంతాల్లో టీడీపీ పటిష్టంగా ఉంటుందని ఎర్రబెల్లి పేర్కొన్నారు.

మరోవైపు కేసీఆర్‌పై మోత్కుపల్లి ధ్వజమెత్తారు. వెయ్యిమంది విద్యార్థులను కేసీఆర్ బలితీసుకున్నారన్నారు. కేసీఆర్ తీరుకు నిరసనగా చేపట్టిన వెయ్యి డబ్బులు...లక్ష చెప్పులు కార్యక్రమానికి అందరూ మద్దతు ఇవ్వాలని మోత్కుపల్లి కోరారు.