July 6, 2013
టీడీపీలో వేధింపులకు చోటు లేదు: బాబు
రంగారెడ్డి : టీడీపీలో వేధింపులకు చోటు లేదు అని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. కొంపల్లిలో జరిగిన టీడీపీ ప్రాంతీయ సదస్సులో బాబు ప్రసంగించారు. ప్రతి నేతను, కార్యకర్తను కాపాడుకునే సత్తా తమకు ఉందన్నారు. సమాజ అభివృద్ధి కోసం పాటు పడదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని కార్యకర్తలను కోరారు.
Posted by
arjun
at
10:27 PM