July 6, 2013

నేడే టీడీపీ ప్రాంతీయ సభ

 వరంగల్ జిల్లా కాజీపేటలో ఆదివారం జరుగునున్న టీడీపీ ప్రాంతీయసభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లా ల నుంచి హాజరుకానున్న 20 వేల మందికిపైగా ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని వసతులు కల్పించారు. పార్టీ అధినేత చంద్రబాబుకు సభావేదికకు దగ్గర్లోనే బాలవికాస అతిధిగృహంలో బస ఏర్పాటు చేశారు. సభ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సాగుతుంది. పంచాయతీ ఎన్నికలతోపాటు తెలంగాణ రాష్ట్ర సాధనకు ఇప్పటివరకు టీడీపీ తన వంతుగా చేసిన కృషి తదితర అంశాలను ప్రజలకు మరింత స్పష్టంగా వివరించేందుకు అనుసరించాల్సిన విధానాలను కూ డా సమీక్షిస్తారు. ప్రత్యేక తెలంగాణపై టీడీపీ చేసిన తీర్మానం, కేంద్రానికి రాసిన లేఖలతో కూడిన కరపత్రాన్ని ప్రత్యేకంగా ముద్రించారు. సభలో ప్రతినిధులకు వాటిని పంపిణీ చేస్తారు. సభానంతరం చంద్రబాబు బాలవికాస సమావేశ మందిరంలో నాలుగు జిల్లాల పరిధిలోని శాసనసభా నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయి సమావేశాలను వరకు నిర్వహిం చనున్నట్లు తెలిసింది. ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఎడబోయిన బస్వారెడ్డి, వేం నరేందర్‌రెడ్డి తదితర నేతల బృందం శనివారం సాయంత్రం సభాప్రాంగణాన్ని సందర్శించారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశా