July 6, 2013

సైకిలెక్కిన డి.కె. సమరసింహారెడ్డి

రంగారెడ్డి : కొంపల్లి ప్రాంతీయ సదస్సులో మాజీ మంత్రి డి. కె. సమరసింహారెడ్డి సైకిలెక్కారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో సమరసింహారెడ్డి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సమరసింహారెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు టీడీపీలో చేరారు. సమరసింహారెడ్డి మంత్రి డీకే అరుణ బావ.