July 6, 2013
టీడీపీ కార్యకర్తలకు నీతి, నిజాయితీలు ఉన్నాయి : చంద్రబాబు
టీడీపీ కార్యకర్తలకు నీతి, నిజాయితీలు ఉన్నాయని,
పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్న కార్యకర్తలు ఉన్నారని టీడీపీ అధినేత
చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శనివారంఉదయం నగరంలో జరుగుతున్న టీడీపీ
ప్రాంతీయ సదస్సులో బాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి
ప్రసంగిస్తూ అధికారం కోసం కొందరు నేతలు టీడీపీని వీడారని, ఒక్క కార్యకర్త
కూడా టీడీపీని వీడలేదని ప్రసంసించారు.
మహానాడును మించి కొంపల్లి ప్రాంతీయ సదస్సు జరిగిందన్నారు. టీడీపీ
కుటుంబసభ్యులు తన ప్రాణసమానులన్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన
ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని మండిపడ్డారు. కార్యక్రమం ప్రారంభం ముందు
ఉత్తరాఖండ్ వరదబాధితులను టీడీపీ సంతాపం ప్రకటించింది.
వరద
బాధితులకు రూ.10 లక్షల ఆర్థికసాయం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించలేదని, ప్రభుత్వం
చేయలేని పని టీడీపీ చేసిందని చంద్రబాబు పేర్కొన్నారు.
Posted by
arjun
at
3:42 AM