March 25, 2013

టీడీఎల్పీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

తూ.గో : వస్తున్నా...మీకోసం పాదయాత్రలో ఉన్న టీడీ పీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం ఉదయం టీడీఎల్పీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అసెంబ్లీలో విద్యుత్ సమస్యలపై చర్చకు పట్టుబట్టాలని ఎమ్మెల్యేలకు సూచించారు. విద్యుత్ సమస్యపై చర్చ జరగకుండా వైసీపీ అడ్డుకునే అవకాశం ఉందని, చర్చ జరిగితే విద్యుత్ సంక్షోభానికి వైఎస్ కారణమనే విషయం బయటపడుతుందని నేతలకు తెలిపారు. ప్రభుత్వం కూడా తప్పుంచుకోవాలనే ప్రయత్నం చేస్తుందని, సభలో ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఎమ్మెల్యేలకు బాబు నిర్దేశించారు.