March 2, 2013

ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలి


 అవినీతిపరుల నుంచి రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడేందుకు వయస్సును సైతం లెక్కచేయక పాదయాత్ర చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టేందుకు ప్రతి కార్యకర్త ఉత్సాహంగా కదలి రావాలని గుడివాడ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. చంద్రబాబు 'వస్తున్నా..మీకోసం' మలివిడత పాదయాత్ర ఈనెల 5న గుడివాడ చేరుకుంటున్న సందర్భంగా జయప్రదం చేసేందుకు నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం శనివారం నిర్వహించారు. రావి మాట్లాడుతూ చంద్రబాబు పాదయాత్రను కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త శ్రమించాలని పిలుపునిచ్చారు.

నందివాడ, గుడివాడరూరల్, గుడ్లవల్లేరు, పట్టణంలోని నేత లు, కార్యకర్తలు చంద్రబాబు పాదయాత్ర సమాచారాన్ని ఇంటింటికి చెరవేసి వేలాది మంది ప్రజల్ని నెహ్రూచౌక్‌లో జరిగే బహిరంగ సభకు తీసుకువచ్చి టీడీపీ సత్తా చాటాలని ఉద్బోధించారు.

వాడవాడలా పసుపు జెండా రెపరెపలాడేలా చేయాల న్నారు. 5వ తేదీ మధ్యాహ్నాం 2గంటలకు రూరల్ మండలం గాం«ధీ ఆశ్రమానికి ప్రతి నేత, కార్యకర్త చేరుకుని అధినేతకు ఘనస్వాగతం పలకాల న్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లంకదాసరి ప్రసాదరావు మాట్లాడుతూ ఎమ్మె ల్యే అంబటి బ్రహ్మణయ్యకు ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ అవనిగడ్డలో కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికి టీడీపీ సత్తా చాటారన్నారు. అదే ఉత్సాహంతో పార్టీ నేత లు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించాలన్నారు. చంద్రబాబు పాదయాత్ర విజయంతానికి అం దరూ సమిష్టిగా కృషి చేయాలని పలువురు నేతలు సూచించారు.