March 2, 2013

చంద్రుడి జోష్


ఉదయం సమీక్షలు... సాయంత్రం పాదయాత్ర, బహిరంగ సభలతో చంద్రబాబు టీడీపీ నాయకులు, కార్యకర్తలకు హుషారెక్కిస్తున్నారు. జిల్లాలో మలివిడత చేపట్టిన వ స్తున్నా..మీకోసం పాదయాత్ర విజయవంతంగా సాగుతుండటంతో పార్టీ నేతల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. బాబు బస చేసిన శిబిరానికి ఉదయాన్నే చేరుకుంటూ అక్కడి నేతలతో కలిసి ఉండటం, బాబును కలిసేందుకు వచ్చే ఇతర జిల్లాల నేతలతో మాట్లాడటం, కార్యకర్తలను పలుకరించటం వంటి కార్యక్రమాల్లో ముఖ్యనేతలు బిజీగా, హుషారుగా గడుపుతున్నారు...

చల్లపల్లి-ఘంటసాల: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ స్తున్నా..మీకోసం పాదయాత్ర జిల్లాలో విజయవంతంగా సాగుతుండటంతో పార్టీ నేతల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. బాబు బసచేసిన శిబిరానికి ఉదయాన్నే చేరుకుంటూ అక్కడి నేతలతో కలిసి ఉండటం, బాబును కలిసేందుకు వస్తున్న ఇతర జిల్లాల నేతలతో మాట్లాడటం, కార్యకర్తలను పలకరించటం తదితర కార్యక్రమాల్లో ముఖ్యనేతలు బిజీగా, హుషారుగా గడుపుతున్నారు. బాబు బసచేసిన ప్రాంతంలో శుక్రవారం పార్టీనేతలు హుషారుగా కనిపించారు. మరోవైపు సమీక్షలకోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, స్థానిక నేతలు, కార్యకర్తలు తమ అభిమాన నేతలతో ఫొటోలు దిగుతూ సందడి చేశారు.

అయ్యన్నపాత్రుడితో ముచ్చట్లు

చిట్టూర్పు శివారు ప్రాంతంలో శుక్రవారం చంద్రబాబు బసచేసిన ప్రాంతానికి మాజీమంత్రి, విశాఖజిల్లా నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు తన కుమారుడు విజయ్, విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణతో కలిసి వచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, ఎమ్మెల్పీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్, టీడీపీ రాష్ట్రనేత వర్ల రామయ్య, విజయవాడ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్, మాజీ ప్రభుత్వ విప్ కాగిత వెంకట్రావ్ తదితరులు అయ్యన్నపాత్రుడితో ముచ్చటించారు. .

అయ్యన్నపాత్రుడి కుమారుడు విజయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువగా, నేతలంతా వారసుడు వచ్చాడా అంటూ తండ్రీ కొడుకులతో ముచ్చటించారు. పలువురు అభిమానులు వంశీమోహన్, కాగిత వెంకట్రావ్‌లతో ఫొటోలు దిగారు. సమీక్ష ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తూ కార్యకర్తలను బచ్చుల అర్జునుడు సమన్వయం చేయగా, చంద్రబాబు పాదయాత్ర, వసతి ఏర్పాట్లు పర్యవేక్షించే గరికపాటి మోహనరావు అటు బాబుతో, ఇటు సెక్యూరిటీ, ముఖ్యనేతలతో మాట్లాడుతూ బిజీగా గడిపారు. పలువురు వ్యాపారవేత్తలు, స్థానిక ప్రముఖులు టీడీపీ నేతలతో కలిసి తిరుగుతూ సందడి చేశారు.