March 2, 2013

ఏబీఎన్ కథనాలకు స్పందించిన ఎన్టీఆర్ ట్రస్ట్

కుమారుడి గుండె శస్త్ర చికిత్సకోసం నగరానికి వచ్చి దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లలో కుటుంబం మొత్తం ఆస్పత్రి పాలైన వైనంపై ఏబీఎన్‌లో వచ్చిన కథనాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ స్పందిచింది. హార్ట్ పేషెంట్ చిన్నారి అనిల్ మెడికల్ రిపోర్టులు పరిశీలించి ఉచిత వైద్యం అందించనున్నట్లు ఎన్టీఆర్‌ట్రస్ట్ తెలిపింది. వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సూచించారు.