కిరణ్కుమార్రెడ్డిది చేతగాని ప్రభుత్వం అని టీడీ పీ
అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. ప్రజల సొమ్మును కాంగ్రెస్ దొంగలు
దోచుకున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం ప్రజల కష్టాలను దోచుకోవడమే తప్ప
ఆదుకోవడానికి లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గురువారం ఉదయం మాగల్లు
నుంచి 115వ రోజు పాత్రయాత్రను బాబు ప్రారంభించారు. పల్లగరి మీదుగా
నందిగామకు పాదయాత్ర సాగనుంది. ఈ రోజు మొత్తం 15.6 కి.మీ మేర చంద్రబాబు
నడవనున్నారు