December 30, 2012
బాబు ఆత్మీయత..జనం పులకింత
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన
'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర రెండో రోజు (ఆదివారం) కూడా ప్రశాంతంగా సాగింది. ప్రజలు
భారీ సంఖ్యలో హాజరయ్యారు. బాబు పాదయాత్ర ప్రజలకు ఓ భరోసానిస్తున్నది. బాబు ఆత్మీయ స్పర్శతో
పల్లెవాసులు పులకించి పోతున్నారు. రెండో రోజు పాదయాత్ర సందర్భంగా కనిపించిన దృశ్యం
ఇది. బాబు కోసం దారి పొడవునా గంటల తరబడి ఎదురు చూ స్తున్నారు. ప్రత్యక్షంగా కలిసి సమస్యలను
వివరిస్తున్నారు.
కష్టాల నివేదన
మాజీ ముఖ్యమంత్రికి తమ కష్టాలు నివేదించుకుంటే తొలిగిపోతాయన్న ఓ చిరు ఆశ
ప్రజ ల్లో కనిపిస్తోంది. తమ ఇబ్బందులను ధైర్యంగా చెబుతున్నారు. సుబ్బక్కపల్లిలో పొలాల్లో
పని చేస్తున్న మహిళా వ్యవసాయ కూలీలు, కొం దరు రైతులు బాబు రావడాన్ని గమనించి చేస్తు
న్న పనిని పక్కన బెట్టి రోడ్డుమీదికి వచ్చారు. వారిని చూసిన బాబు దగ్గరి వెళ్ళారు.
వారితో పాటు బండమీద కూర్చున్నారు. సమస్యలేమిటని అడగడంతోనే ఒక్కొక్కరు మైకు
తీసుకొని తమ కష్టాలను ఏకరువు పెట్టారు. కరెంట్ మొ దలుకొని గ్రామానికి బస్సు సౌకర్యం
లేకపోవ డం వరకు అన్నీ బాబు దృష్టికి తీసుకువచ్చారు. వారి నివేదనలో స్పష్టత, ఆవేదన చూసి
బాబు చలించి పోయారు. 'నేనున్నాను. ధైర్యంగా ఉండండి. త్వరలో మంచి రోజులు వస్తాయి. త్వరలో
కష్టాలన్నీ తీరుతాయి' అని ధైర్యం చెప్పారు.
సూటిగా ప్రశ్నలు
ఇదే దృశ్యం నవాబుపేట బహిరంగ సభలో నూ కనిపించింది. చంద్రబాబు ప్రసంగిస్తూ
' మీ సమస్యలేమిటో చెప్పండి' అంటూ మహిళను ప్రోత్సహించారు. జ్యోతి అనే మహిళ నిర్భయంగా
తాము ఎదుర్కొంటున్న కష్టాలను వివరించింది. ధరల పెరుగుదల, కరెంట్ కొరత, బ్యాంకులు డ్వాక్రా
మహిళలకు ఇచ్చే రుణాల ను వారి భర్తల అప్పుల కింద జమకట్టుకోవ డం, వంటగ్యాస్ కనెక్షన్లు
ఇవ్వకపోవడంతో అ నేక సమస్యలను బాబు దృష్టికి తీసుకువచ్చిం ది. సావధానంగా ఆలకించిన బాబు
వాటికి కారణం రాష్ట్రంలోని అసమర్ధ పాలనే కారణం గా పేర్కొన్నారు.
ప్రధాన సమస్య కరెంట్
గ్రామస్థులు చెబుతున్న ప్రధాన సమస్య కరెంట్ కోత. వ్యవసాయానికి నిరంతరాయం
గా రోజుకు 7 గంటలు కరెంట్ ఇస్తున్నట్టు చెబుతున్నా ఎక్కడా అది అమలు కావడం లేదన్న విషయం
పాదయాత్రలో స్పష్టం కనిపిస్తోంది. కరెంట్ లేక చేతికొచ్చిన ఎండిపోయిన పంటల ను చూపిస్తూ
రైతులు కంటనీరు పెడుతున్న దృ శ్యాలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. పాదయాత్రలో బాబుకు
అనేక మంది వినతిపత్రాలను సమర్పిస్తున్నారు. వివిధ సంఘాల వారు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు.
మధ్యాహ్నం మొదలై..
బాబు ఆదివారం మధ్యాహ్నం 2.22 గంటలకు బస్సు నుంచి బయటకు వచ్చారు. నాయకులు,
కార్యకర్తలతో కలిసి ఫోటోలు దిగారు. 2.35 గంటలకు పాదయాత్ర ప్రారంభం అ యింది. సుబ్బక్కపల్లి
నవాబుపేట మధ్య 3 కి. మీ. నడిచారు. ఎగుడుదిగుడు గుట్టల మధ్య ఇ రుకు రోడ్డుపై యాత్ర సాగింది.
ఎంఆర్పీఎస్ కార్యకర్తల హడావిడి, డప్పుచప్పుళ్ళ మధ్య సందడిగా సాగింది. మార్గంమధ్యలో
బాబు ఫొటోగ్రాఫర్లకు పోజులివ్వడమే కాకుండా వారి నుంచి కెమెరా తీసుకుని తాను కొద్దిసేపు
ఫొటోగ్రాఫర్ అయ్యారు. పత్తి చేను సందర్శించారు. రైతుతో మాట్లాడారు.
ఇస్సిపేటలో బస
సాయంత్రం మొగుళ్ళపల్లికి చేరుకున్నారు. ఇక్కడా బహిరంగ సభలో మాట్లాడారు.
మార్గమధ్యలో వంతెన నిర్మాణం జరుగుతున్న వాగు వద్ద కొద్ది సేపు ఆగారు. టీ తాగారు. మొగుళ్ళపల్లి
నుంచి మరో 4.5 కిమీ పాదయాత్ర చేసి ఇస్పిపేటకు చేరుకున్నారు. అక్కడే రాత్రి బస చేశారు.
Posted by
arjun
at
11:12 PM