December 30, 2012
తొలి అడుగు అదిరింది!
వరంగల్ జిల్లాలో తొలిరోజు పాదయాత్ర ఉద్రిక్తతలకు
దూరంగా ప్రశాంతంగా జరిగింది. టీఆర్ఎస్ బంద్ పిలుపు నేపథ్యంలో యాత్ర సజావుగా సాగుతుందో
లేదో అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ.. చంద్రబాబు జనంలోకి ఉత్సాహంగా నడిచివెళ్లారు.
12 గంటల సమయంలో పాదయాత్ర ప్రారంభమైంది. తొలి రోజు ఐదు గ్రామాల మీదుగా 13 కిలోమీటర్లు
నడిచారు.
ఎమ్మార్పీస్ కార్యకర్తలు తమ పతాకాలతో ఆయనకు తోడుగా సాగారు. డప్పుచప్పుళ్లతో
కళాకారులు ముందు నడిచారు. వెల్లంపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మగుడిని చంద్రబాబు దర్శించుకున్నారు.
అమ్మవారికి పూజలు చేశారు. సరిగ్గా రెండు గంటలకు దుబ్యాల గ్రామ శివార్లలో మధ్నాహ్నం
భోజనం తీసుకొన్నారు. కొద్ది సేపు విశ్రాంతి తీసుకొని 4 గంటలకు పాదయాత్రను తిరిగి మొదలు
పెట్టారు. రాఘవరెడ్డిపేట, అంకుశాపురం మీదుగా సుబ్బక్కపల్లి బసకు చేరుకున్నారు.
Posted by
arjun
at
6:47 AM