December 30, 2012
కేంద్రం తలదించుకోవాలి: చంద్రబాబు
ఢిల్లీలో యువతిపై సామూహిక అత్యాచార ఘటన విషయంలో
కేంద్ర ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.
వరంగల్ జిల్లా చిట్యాల మండలం వెల్లంపల్లిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆ యువతి మృతికి సంతాప సూచకంగా చంద్రబాబుతో పాటు టీడీపీ నాయకులంతా
నల్లబ్యాడ్జీలను ధరించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. సామూహిక అత్యాచార ఘటనపై ప్రభుత్వం
మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ను వెంటనే సమావేశ పరిచి ఇలాంటి
అమానవీయ సంఘటనలు పునరావృతం కాకుండా ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలను పటిష్ఠం చేయాలని
బాబు డిమాండ్ చేశారు.
Posted by
arjun
at
2:17 AM