July 2, 2013

కాంగ్రెస్‌లో వైసీపీ విలీనంఖాయం:మోత్కుపల్లి

హైదరాబాద్ : కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం కావడం ఖాయమని టీడీపీ మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, వైసీపీ రెండూ అవినీతిమయ పార్టీలే అని పేర్కొన్నారు. వైఎస్ మంచి నాయకుడు అని దిగ్విజయ్‌సింగ్ అనడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. వైఎస్ మృతి పట్ల బాధ ఉండవచ్చు గానీ, ఆయన నేరాలు మరిచిపోలేమని గుర్తు చేశారు.