July 2, 2013

నగరానికి చేరుకున్న టీడీపీ ప్రత్యేక విమానం

ఉత్తరాఖండ్‌ నుండి 80 మంది వరద బాధితులతో బయలుదేరిన తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం రాజధానికి చేరుకుంది. డెహ్రాడూన్‌ నుండి 80 మంది వరద బాధితులతో పాటు, టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కొనకళ్ల నారాయణ నగరానికి చేరుకున్నారు. వారికి టీడీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుండి బాధితులను స్వస్థలాలకు తరలించేందుకు టీడీపీ నాయకుడు కేశినేని నాని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.