July 2, 2013
వైజాగ్ ప్రాంతీయ సదస్సులో పాల్గొననున్న బాబు..!
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై తెదేపా పూర్తి స్థాయి దృష్టిసారించింది.
పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ సదస్సులను
నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. పంచాయితీల వారీగా ప్రతినిధులు
పాల్గొనే ఈ సదస్సలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై
చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతీయ సదస్సులలో భాగంగానే తెదేపా
అధినేత చంద్రబాబు నాయుడు రేపు (బుధవారం) విశాఖలో పర్యటించనున్నారు. పార్టీ
అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో.. వైజాగ్ లో నిర్వహించే ఈ ప్రాంతీయ
సదస్సుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల పంచాయితీల
నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే 6
ప్రాంతీయ సదస్సులలో విశాఖలో నిర్వహించే సదస్సు మొదటిది. కాగా, బాబు
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ”వస్తున్నా.. మీకోసం” పాదయాత్ర, చత్తీస్ గడ్
బాధితులను ఆదుకోవడంలో చూపిన చొరవ.. తదితర అంశాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో
తెదేపాకు కలసివస్తోందని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.
Posted by
arjun
at
6:31 AM