July 2, 2013

సుబ్బయ్యపాలెం సొసైటీ ఎన్నికల్లో ఉద్రిక్తత

సుబ్బయ్యపాలెం సొసైటీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల సందర్భంగా రొంపిచర్ల మండలంలోని సొసైటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ సానుభూతిపరుడిని వైకాపా వర్గీయులు తీసుకెళుతున్నారంటూ వైకాపా నేత గోపిరెడ్డిశ్రీనివాసరెడ్డి కారును టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.