July 2, 2013

ఎన్నికల కోసమే డిగ్గీరాజా ప్రచార ఆర్భాటాలు:పయ్యావుల

వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ దుయ్యబట్టారు. రాష్ట్ర గవర్నర్‌ నోటి వెంట కాంగ్రెస్‌ అధిషాఠనం మాటలు రావడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఇటువంటి మాటల వల్ల గవర్నర్‌ వ్యవస్థ ఏ రకంగా పని చేస్తుందో అర్ధమవుతుందన్నారు. ఇటువంటి మాటల వల్ల గవర్నర్‌ వ్యవస్థపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతాయని చెప్పారు.