May 27, 2013
మహానాడు ప్రాంగణంలో లోకేష్ సందడి
మహానాడు వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత
నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహానాడు
వేడుకల సందర్భంగా లోకేష్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకుని
క్రీయాశీలక రాజకీయాల్లోకి తన ఆగమనం ఖాయమని తేల్చి చెప్పారు. యువ నేతలతో
కలిసి ఆయన మహానాడు ప్రాంగణంలో సందడి చేశారు. పార్టీ సీనియర్ నేతల
కుమారులతో కలిసి ప్రతి ఒక్కర్ని పలకరిస్తూ కార్యకర్తల్లో, నేతల్లో
ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. దివంగత నేత ఎర్రన్నాయుడు కుమారుడు
రాంమోహన్నాయుడు, పరిటాల రవీంద్ర కుమారుడు పరిటాల శ్రీరామ్, పొలిట్బ్యూరో
సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్, రాజ్యసభ సభ్యుడు
దేవేందర్గౌడ్ కుమారుడు వీరేందర్గౌడ్లతో కలిసి ఆయన మహానాడు ప్రాంగంణలో
హల్చల్ చేశారు.
Posted by
arjun
at
7:57 AM