May 27, 2013

మహానాడులోయువనేతల హడావుడి!


ఇవాళ రేపు జరుగుతున్న మహానాడుకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు విచ్చేశారు. గండిపేట మహానాడు ప్రాంగణంలో యువనేతలు హంగామా కన్పించింది. సీనియర్లకు సభ వేదిక ఇచ్చేసి, యువనేతలతో వేదిక ముందే కూర్చున్నారు. వీరికి చంద్రబాబు కొడుకు నాయకత్వం వహించగా దివంగత నేత ఎర్రంనాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు, పరిటాల శ్రీరాం ఎక్కువగా మీడియా దృష్టిని ఆకర్షించారు. వీరితో పాటు కరణం బలరాం కుమారుడు, దేవేందర్ గౌడ్ కుమారుడు అలాగే అయన్నపాత్రుడు, దయాకర్ రెడ్డి, బొజ్జల కుమారులు మహానాడులో హల్ చల్ చేశారు. వీరిని చూస్తుంటే 1983 నాటి పరిస్థితులు గుర్తుకువస్తున్నాయని కొందరు సీనియర్లు వ్యాఖ్యానించారు.