May 27, 2013

రైతు రుణమాఫీపైనే తొలి సంతకం


హైదరాబాద్‌ : టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణమాఫీపైనే తొలి సంతకం పెడుతామని టీడీపీ చీఫ్‌ చంద్రబాబు స్పష్టం చేశారు. తమ హయాంలో మిగులు కరెంట్‌ ఉండేదని ఆయన చెప్పారు. టీడీపీ మహానాడు గండిపేటలో సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రం తీవ్ర విద్యుత్‌ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఆయన చెప్పారు. కరెంట్‌ సమస్యతో 6.30 లక్షల చిన్న తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయని, ఎంతో మంది నిరుద్యోగులయ్యారని ఆయన తెలిపారు. రేషన్‌ సరుకుల్లో అన్నింటికీ కోత పెట్టారని ఆయన ఆరోపించారు. అమ్మ హస్తం కాదని, అది మొండి హస్తమని ఆయన ఎద్దేవా చేశారు. అమ్మ హస్తంలో ప్రజలకు నాసిరకం సరుకులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.