May 27, 2013
మద్యం ఏరులై పారుతోంది
హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని టీడీపీ చీఫ్
చంద్రబాబునాయుడు అన్నారు. గండిపేటలో టీడీపీ మహానాడు ప్రారంభమైంది. ఈ
సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా
మార్చారని ఆయన ధ్వమెత్తారు. సీబీఐ అనేక ఛార్జిషీట్లలో వైఎస్ కొడుకు
జగన్ను దోషిగా నిలబెట్టిందన్నారు. కళంకిత మంత్రులను బర్తరఫ్ చేయాలన్నారు.
టీడీపీ ఉద్యమం వల్లనే ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారని ఆయన చెప్పారు.
దొంగల రైలులో డ్రైవర్ మాత్రమే మారాడు, దొంగ మంత్రులు మాత్రం
కొనసాగుతున్నారని ఆయన విమర్శించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు న్యాయ
సహాయం అందించవద్దని అన్నారు. అవినీతిపరులను ఉపేక్షించేది లేదన్నారు.
అవినీతికి పాల్పడినవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన చెప్పారు.
తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది ఎన్టీఆర్
తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఆయన పొగిడారు.తన రాజకీయ జీవితంలో మరుపురాని ఘట్టం వస్తున్నా ... మీకోసం పాదయాత్ర అని ఆయన పేర్కొన్నారు. ఈ పాదయాత్రలో ప్రజల కష్టాలను దగ్గరగా చూశానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో, దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది ఎన్టీఆర్
తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఆయన పొగిడారు.తన రాజకీయ జీవితంలో మరుపురాని ఘట్టం వస్తున్నా ... మీకోసం పాదయాత్ర అని ఆయన పేర్కొన్నారు. ఈ పాదయాత్రలో ప్రజల కష్టాలను దగ్గరగా చూశానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో, దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
Posted by
arjun
at
2:00 AM