May 20, 2013

'జీవోలపై సంతకాలు చేసిన మంత్రులు శిక్ష అనుభవించాల్సిందే'


నెల్లూరు, మే 20 : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అత్యాసవల్లనే మంత్రులు, ఐఏఎస్ అధికారులు జైళ్లకు వెళుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మినీ మహానాడుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జివోలపై సంతకాలు చేసిన మంత్రులు తప్పనిసరిగా శిక్షను అనుభవించాల్సిందేనని చెప్పారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తొలగించాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఇందిరాపార్కు వద్ద ఆందోళన చేపట్టింది. ఆందోళనలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... 48 గంటల్లో మంత్రులను తొలగించకపోతే రాజభవన్, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.