May 20, 2013

వైఎస్‌ హయాంలో విచ్చలవిడిగా అవినీతి పెరిగింది:చంద్రబాబు

న్యూఢిల్లీ : వైఎస్‌ హయాంలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని టీడీపీ చీఫ్‌ నారా చంద్రబాబునాయుడు తెలిపారు. వైఎస్‌ చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టులన్నింటిలో అక్రమాలు జరిగాయని ఆయన చెప్పారు. గనులు, ఖనిజ సంపదను, ఎస్‌ఈజడ్‌ల పేరుతో భూములను అన్యాక్రాంతం చేశారని ఆయన ధ్వజమెత్తారు. కళంకిత మంత్రులను తొలగించాలని కోరుతూ సోమవారం బాబు ఆధ్వర్యంలో టీడీపీ బృందం రాష్టప్రతిని కలిసింది. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కళంకిత మంత్రులను వెంటనే తొలగించాలని రాష్టప్రతి ప్రణబ్‌ను కోరినట్టు ఆయన చెప్పారు. రాజా ఆఫ్‌ కరప్షన్‌, మైనింగ్‌ మాఫియా పుస్తకాలను ప్రణబ్‌కు అందించామని ఆయన తెలిపారు.