May 20, 2013

రాజ్‌భవన్‌ను ముట్టడిస్తాం : తలసాని

హైదరాబాద్ : కళంకిత మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ వద్ద టీడీపీ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత తలసాని శ్రీనివాస్‌యాదవ్ మీడియాతో మాట్లాడారు. 24 గంటల్లోపు కళంకిత మంత్రులను బర్తరఫ్ చేయకపోతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.