కరీంనగర్ : అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సేవ చేయాలని టీడీపీ అధ్యక్షుడు
చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ అన్నారు. జగిత్యాల మినీ మహానాడులో
సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన దారి తప్పిందని విమర్శించారు.
అందుకే సమర్ధవంతమైన నాయకుడినే ముఖ్యమంత్రిగా ఎన్నకోవాలని అన్నారు.