March 17, 2013

మాది నిఖార్సయిన కుటుంబం


ఏలూరు : 'ఎన్టీఆర్ కుటుంబం నిఖార్సయిన కుటుంబం. ఏనాడూ ఈ కుటుంబం బయటకు రాలేదు. మా ఇంట్లో వాళ్లు కూడా కష్టపడతారు. వైఎస్ కుటుంబానిది అరాచకం. పేదల కోసమే ఆనాడైనా, ఏనాడైనా పోరాడతాం' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్టీఆర్ కుటుంబం, వైఎస్ కుటుంబ తీరును ఆయన బేరీజు వేసుకొచ్చారు. నాకు ఒకకొడుకు, కుటుంబ నియంత్రణ పాటించాను, బాగా చదివించాను. మా ఆవిడ కష్టపడుతోంది. కోడలు కష్టపడుతోంది. ఉన్నంతలోనే మేము బతుకుతున్నాం. ఆదాయ పన్నును ప్రతి ఏడాది ప్రకటిస్తున్నాం. మా కుటుంబం మాదిరిగా ఏ నాయకుడి కుటుంబం అయినా ఈ దేశంలో నిక్కచ్చిగా ప్రకటిస్తుందా అని చంద్రబాబు అన్నారు.

వస్తున్నా మీకోసం యాత్రలో భాగంగా చంద్రబాబు శనివారం 166వ రోజు యాత్ర కు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆయ న 2375 కిలోమీటర్ల మేర ప్రయాణిం చి పాదయాత్ర పూర్తి చేశారు. దీనిని పురస్కరించుకుని తాడేపల్లిగూడెం క న్వీనర్ ముళ్లపూడి బాపిరాజు 2375 మోటారు సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించి బాబుకు సంఘీభావం ప్రకటించారు. తణుకు ఫ్లై ఓవర్ వద్ద భారీ జ న సమూహాన్ని ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు.

వైఎస్ కుటుంబం అ రాచక కుటుంబం. కొడుకు లక్ష కోట్లు దోచుకుని జైలుకు వెళ్లాడు. అల్లుడికి బ య్యారం గనులు అప్పగించారు. బావమరిది ఫోర్జరీ కేసుల్లో ఇరుక్కున్నాడు. హత్యలు చేయడం, అవినీతికి పాల్పడ టం ఆ కుటుంబానికి తెలిసిన విద్య అ ని ఆరోపించారు. అవినీతికి పాల్పడి త మ నాయకుడు జైలులో ఉంటే అ లాం టి నేతతో ఫ్లెక్సీలు పెట్టుకుని స్థానికు లు ఊరేగటం ఎలాంటి సంకేతాల ను ప్రజలకు అందిస్తున్నారంటూ పిల్ల కాంగ్రెస్ నేతలను ఆయన ప్రశ్నించా రు. వైఎస్ రైతులకు తొమ్మిది గం టలు కరెంటు ఇస్తానన్నాడు. అది సాధ్యం కాలేదు. కిరికిరి సీఎం ఏడు గంటలు ఇ స్తానని, ఏడు గంటలు ఇవ్వలేకపోయా డు. వీళ్లా ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకునే నేతలా అంటూ నిగ్గుతీశారు.

ర్రాష్టంలో రాక్షస పాలన సాగుతోందని దుయ్యబట్టారు. 'పిల్లలను ఎలా త యారు చేయాలనుకుంటున్నారు.. ఆ జగన్ మాదిరిగా అవినీతిపరులుగా నా, పులివెందుల రౌడీల మాదిరిగా నా, హత్య చేసేవాళ్లగానా, లేక వీటికి భిన్నంగా క్రమశిక్షణతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనుకుంటున్నా రా' అంటూ తల్లిదండ్రులు ఇ ప్పుడు న్న రాజకీయాలను చూసి నిర్ణయించుకోవాలని కోరారు. మీకు బంగారు భ విష్యత్ ఉంది. ఈ ర్రాష్టంలో అవినీతి తో పేట్రేగిపోయిన వాళ్లు రకరకాల కూతలు కూస్తున్నారు. వీటిని నమ్ము కుంటే భవిష్యత్ నాశనం అయ్యే ప్ర మాదం ఉందని హెచ్చరించారు.

నే ను అధికారం కోసం రాలేదు. క్రమశిక్ష ణ తప్పలేదు. ఏది చేస్తానో అదే చెబుతాన ని స్పష్టం చేస్తూ పిల్ల కాంగ్రెస్, తల్లికాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోశారు. సీఎం కి రణ్‌కుమార్‌రెడ్డిపైనావిరుచుకుపడ్డారు.

ఉంగుటూరు, తణుకు కార్యకర్తల స మావేశంలో ప్రతిదానికీ డబ్బే ముఖ్యం కాదు. సేవ చేయాలి. అప్పుడే ప్రజలు మనల్ని గుర్తిస్తారు. గౌరవిస్తారు, గెలిపిస్తారు అని కార్యకర్తలకు హితవు పలికారు. అప్పట్లో కాంగ్రెస్‌లో విలువలు ఉండేవని, ఇప్పుడు అవన్నీ హరించుకుపోయాయని అన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై స్పందించాల్సి ఉం టే, దీనికి భిన్నంగా ఏవేవో జరుగుతున్నాయని, వీటి కారణంగా అసలు స మస్యలు మరుగునపడుతున్నాయని ఆయన పేర్కొంటూ తమ తప్పులు బ యటపడకుండా సభ వాయిదాపడితే నే మంచిదని భావిస్తున్నారని చెప్పా రు.

కౌలు రైతుల రుణం విషయాన్ని కూడా ఆయన తాజాగా ప్రస్తావించా రు. కౌలు రైతులు, బ్యాంకులు, సొసైటీల్లో రుణాలు తీసుకుని ఉంటే తప్పనిసరిగా వాటి మాఫీ విషయంలో కూ డా పార్టీపరంగా ఒక నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇవ్వడం ద్వారా కౌలు రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రైతు వ్యతిరేకిగా తెలుగుదేశం పై జరుగుతున్న ద్రుష్పచారాన్ని కార్యకర్తలు నేరుగానే తిప్పికొట్టాలని కూడా కోరారు. జాబ్ రావాలంటే బాబు రా వాలని నిరుద్యోగులు కోరుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారు. టీడీపీ అ ధికారంలోకి వస్తే ఉపాధి అవకాశాల ను మెరుగుపరుస్తానని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మా నం తుస్‌మందని ఆ రెండు పార్టీల తీ రును ప్రజలకు వివరించారు.

తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే కరెంటు కష్టాలు తప్పుతాయని ఆయ న స్పష్టం చేశారు. మీరు మేము చెప్పేదంతా నమ్మితే సహకరించండని పిలుపునిచ్చారు. నాకో అవకాశమిస్తే ఐదేళ్ల పాటు మీ సేవకుడిగా ఉంటానని కూ డా అభ్యర్థించారు. అగ్రవర్ణాల పేదల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయని, వీరికి రిజర్వేషన్ కల్పించే అంశం పరిశీలిస్తామని ప్రకటించారు. రైతులతో పాటు కౌలు రైతులు కూడా ఇబ్బందుల్లో ఉ న్నారని, వారి రుణాల మాఫీలోనూ మాకొక స్థిర నిర్ణయం ఉందని చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబుతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, పార్టీ కన్వీనర్ వై.టి. రా జా, ఎమ్మెల్యేలు శేషారావు, రామారా వు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, పా ర్టీ కన్వీనర్లు ఉన్నారు.