March 17, 2013
టీడీపీ రెబల్స్ స్థానాలపై పీసీసీ నజర్!
హైదరాబాద్: టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై పీసీసీ
ప్రత్యేక దృష్టి సారించింది. అవిశ్వాసం సందర్భంగా విప్ను ధిక్కరించి
అనుకూలంగా ఓటువేసిన ఎమ్మెల్యేల ప్రాం తాల్లో పార్టీ ఇన్చార్జ్లను
నియమించాలని భావిస్తోంది. టీడీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బాల
నాగిరెడ్డి, కొడాలి నాని, అమర్నాథ్రెడ్డి, వనిత, సాయిరాజ్,
ప్రవీణ్కుమార్రెడ్డిలు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా లేచి నిలబడ్డారు.
పార్టీ విప్ను ధిక్కరించిన వీరిపై స్పీకర్కు టీడీపీ ఫిర్యాదు చేస్తే.. ఈ
ఆరుగురిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఫలితంగా ఆ స్థానాలు ఖాళీ అయ్యే
చాన్స్ ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై పీసీసీ దృష్టి
పెట్టింది.
Posted by
arjun
at
10:01 PM