March 27, 2013
కాంగ్రెస్కు గుణపాఠం తప్పదు
టెక్కలి :త్వరలో జరగనున్న
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు గుణపాఠం తప్పదని టీడీపీ
జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జి జోష్యంచెప్పారు. మంగళవారం ఆయన
'ఆంధ్రజ్యోతి'తో మాట్లాడు తూ పంచాయతీల పదవీకాలం ముగి సి రెండేళ్లు గడిచినా
ఎన్నికలు నిర్వహించలేకపోయిన ప్రభుత్వం, ఇప్పుడేమో గెలుస్తామని చెప్పడం
విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు. సొసైటీ ఎన్నికల్లో కాంగ్రెస్ దొడ్డిదారి
గెలిచిందని ఆరోపించారు. ప్రభుత్వ పథకాలే తమను గెలిపిస్తాయని కృపారాణి
గొప్పలుగా చెప్పుకుంటున్నారని, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు,
విద్యుత్కోత, తాగునీటి సమస్య, రైతు సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేద ని
ఆరోపించారు. కేవలం పదవుల కో సం పాకులాడడం మినహా, ప్రజా సమస్యలు
పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎప్పుడు స్థానిక సం స్థలు ఎన్నికలు
జరిగినా అధికార కాం గ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని
స్పష్టంచేశారు.
Posted by
arjun
at
6:19 AM