March 27, 2013

చంద్రబాబు యాత్రకు భారీ ఏర్పాట్లు

రాయవరం: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 'వస్తున్నా... మీ కోసం' పాదయాత్రకు రాయవరంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు రాత్రి బస చేసేందుకు నిర్దేశించిన స్థలాన్ని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు సోమవారం పరిశీలించారు. కా ర్యకర్తలకు భోజనం, మంచినీటి సౌక ర్యం ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు యాత్రలో భాగంగా బుధవారం మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాల సమీక్ష సమావేశం రాయవరంలో జరుగుతుందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు తెలిపారు. అనంతరం రాయవరంలో సుమారు రూ.4 లక్షల తో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని బాబు ఆవిష్కరించి గ్రామంలో పాదయాత్ర కొనసాగిస్తారని చెప్పారు.

బిక్కవోలు: బుధవారం రాత్రి బిక్కవోలులో చంద్రబాబు బసకు ఏ ర్పాట్లు పూర్తయ్యాయి. రెండు రోజులు గా టీడీపీ బిక్కవోలు గ్రామ శాఖ ఆధ్వర్యంలో రజకుల కమ్యూనిటీ హాలు ఆవరణను చదును చేశారు. ఆవరణ వెనుక భాగంలో కార్యకర్తలు, నేతలకు భోజనశాల ఏర్పాటు చేశారు. రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ మం గళవారం బస ఏర్పాట్లను చూసి సం తృప్తి వ్యక్తం చేశారు. ఇక కొమరిపాలెం నుంచి తొస్సిపూడి, బలభద్రపురం, బి క్కవోలు వరకు రోడ్లన్నీ పసుపుమయం అయ్యాయి. భారీ ఎత్తున కటౌట్లు, బ్యా నర్లు, జెండాలు కట్టారు. బిక్కవోలు వంతెన సమీపంలోని ఎన్టీఆర్ విగ్ర హం వద్ద జెండాలతో చేసిన ప్రత్యేక అలంకరణ కనువిందు చేస్తోంది.