March 27, 2013
కాంగ్రెస్ను తరిమికొట్టండి
శాంతిపురం: అవినీతి అక్రమాలతో
పీకల్లోతు కూరుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టాలని
టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. మంగళవారం మండలంలోని
ఎంకేపురం, మొరసనపల్లె తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నదేమి లేదని, అధికార
పార్టీలో ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు దోచుకోని తినడానికే సరిపోతుందని
విమర్శించారు. అలాగే ఈనెల 29న టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని
పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని యువకులు ఉత్సాహంగా
పాల్గొని రక్తదానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ
వెంకటమునిరెడ్డి, చలపతి, శ్యామరాజు, లక్ష్మీబాలకృష్ణ, ఉయ్యాలజయరామిరెడ్డి,
నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
5:53 AM