February 12, 2013
వచ్చే జాతరకు చంద్రబాబును రప్పిస్తాం- రాథోడ్ రమేష్
గతంలో జరిగిన జాతరకు స్వీర్గీయ మాజీ ముఖ్యమం త్రి ఎన్టీఆర్ వచ్చారని, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి వచ్చేలా ప్రయత్నిస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి రూ.1.50 లక్షలతో ఇండ్లు నిర్మిస్తామ ని, గిరిజన ఆడల పిల్లల పెళ్లిలకు రూ. 50 వేలు, 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఆదివాసులకు రూ. 5 వందల చొప్పున ఫింఛన్ ఇస్తామన్నారు. నాగో బా దేవతకు పూజ చేసే పూజారికి రూ. 5 వేలు ఇచ్చేటట్లు కృషి చేస్తామన్నారు.
ఏజెన్సీలో వివిధ రోగాలతో మరణించిన వారి కుటుంబాలకు ఆరు వందల ఫింఛన్ ఇస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీఎంపీపీ కనక తుకారాం, ఎండి మసూద్, దీలిప్ మోరె, భరత్ బామ్నె, రోహిదాస్, ఇం దుబాయి తదితరులు ఉన్నారు.
Posted by
arjun
at
7:26 AM