February 12, 2013

వచ్చే జాతరకు చంద్రబాబును రప్పిస్తాం- రాథోడ్ రమేష్

ఇంద్రవెల్లి: టీడీపీ అధికారంలోకి వస్తే వచ్చే నాగోబా జాతరకు చంద్ర బాబును ముఖ్యమంత్రి స్థాయిలో రప్పించేటట్లు ప్రయత్నిస్తానని ఎంపీ రాథోడ్ రమేష్ అన్నారు. సోమవారం కేస్లాపూర్‌లోని నాగోబా జాతరను సం దర్శించి నాగోబా దర్శనం తీసుకున్నా రు. అనంతరం నాగోబా ఆవరణలో మెస్రం పూజారులు ఎంపీని శాలువతో ఘనంగా సన్మానించారు. గుడి ఆవరణలో ఎంపీ విలేకరులతో మాట్లాడు తూ ఎంపీ ల్యాండ్ నిధులచే నాగోబా ఆవరణలో మెస్రం వంశీయులు కోరిన అభివృద్ధి పనులను చేయుటకు సిద్దం గా ఉన్నానన్నారు.

గతంలో జరిగిన జాతరకు స్వీర్గీయ మాజీ ముఖ్యమం త్రి ఎన్టీఆర్ వచ్చారని, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి వచ్చేలా ప్రయత్నిస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి రూ.1.50 లక్షలతో ఇండ్లు నిర్మిస్తామ ని, గిరిజన ఆడల పిల్లల పెళ్లిలకు రూ. 50 వేలు, 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఆదివాసులకు రూ. 5 వందల చొప్పున ఫింఛన్ ఇస్తామన్నారు. నాగో బా దేవతకు పూజ చేసే పూజారికి రూ. 5 వేలు ఇచ్చేటట్లు కృషి చేస్తామన్నారు.

ఏజెన్సీలో వివిధ రోగాలతో మరణించిన వారి కుటుంబాలకు ఆరు వందల ఫింఛన్ ఇస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీఎంపీపీ కనక తుకారాం, ఎండి మసూద్, దీలిప్ మోరె, భరత్ బామ్నె, రోహిదాస్, ఇం దుబాయి తదితరులు ఉన్నారు.