February 12, 2013

టీడీపీతోనే విద్యార్థుల భవిష్యత్తు: లోకేష్

"ఏమ్మా... బావున్నారా.? ఎలా చదువుతున్నారు..? ఫీజులెలా కడుతున్నారు..? విద్యా వ్యవస్థ ఎలా ఉంది..? మీరు అభివృద్ధి చెందాలంటే మీ భవిష్యత్తును గురించి ఆలోచించే తెలుగుదేశం పార్టీకే ఓటు వేయాల్సిందిగా మీ తల్లిదండ్రులకు చెప్పండి''.. మితభాషిగా పేరున్న చంద్రబాబు కుమారుడు లోకేశ్ ప్రజలను పలకరించిన తీరిది.

అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు అత్తార్ చాంద్ బాషా నూతనంగా నిర్మించిన అత్తార్ రెసిడెన్సీని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతర ం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఏర్పాటు చేసిన మేలుకొలుపు సదస్సులో విద్యార్థినులతో కొద్దిసేపు మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ విద్యా వ్యవస్థ పనితీరు ఎలా ఉందో బేరీజు వేసుకోవాలని సూచించారు.

"మీ నాన్న పాదయాత్ర చేస్తున్నారు... ఎలా ఉంది సార్! ఆరోగ్యంగా ఉన్నారా... మేం బాగా చదువుకుని ఉన్న త స్థాయికి ఎదగాలంటే మీ నాన్నే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నామ''ని పలువురు విద్యార్థినులు అభిప్రాయ పడ్డారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఈ సమయంలో లోకేశ్ అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో యువతదే కీలక పాత్ర అని, దిశానిర్దేశం చేసేది యువతే కాబట్టి అభివృద్ధి దిశగా పయనించాలంటే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.