January 15, 2013
బాబు పాదయాత్రలో స్వల్ప మార్పులు
వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు
నాయుడు కృష్ణా జిల్లా పర్యటన కొద్ది రోజులు ఆలస్యం కానున్నది. ఈ కార్యక్రమంలో స్వల్ప మార్పులు
చోటుచేసుకున్నాయి. ఈ నెల 21 నుంచి పాదయాత్ర ఉంటుందని చెపుతున్నారు.
'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు
నాయుడు కృష్ణా జిల్లా పర్యటన కొద్ది రోజులు ఆలస్యం కానున్నది. ఈ కార్యక్రమంలో స్వల్ప మార్పులు
చోటు చేసుకున్నాయి. ఇంకా పర్యటన రూట్ మ్యాప్ ఖరారు కాలేదు.కృష్ణా జిల్లాలో ఈ నెల 21 నుంచి
పాదయాత్ర ఉంటుందని టీడీపీ నాయకులు చెపుతున్నారు. తొలుత చంద్రబాబు ఖమ్మం జిల్లా ముదిగొండ
మండలం వల్లభి నుంచి ఈ నెల 17న జగ్గయ్యపేట మండలం గండ్రాయి వద్ద కృష్ణా జిల్లాలో ప్రవేశిస్తారని
భావించారు.
కానీ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగి 21 న కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు.
కృష్ణా జిల్లాలో ప్రవేశించే సమయంలో చంద్రబాబుకు భారీగా స్వాగతం పలకాలని టీడీపీ నాయకులు యోచిస్తున్నారు.
వల్లభి, గండ్రాయి మార్గం ఇరుకుగా ఉండటంతో భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలిరావటానికి
ఇబ్బంది కలుగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు జాతీయ రహదారి మీదుగా కృష్ణా జిల్లాలో
ప్రవేశించే విధంగా పర్యటన కార్యక్రమాన్ని నాయకులు ఖరారు చేస్తున్నారు.
Posted by
arjun
at
4:28 AM