January 15, 2013

'బాబు' యాత్రకు అనూహ్య స్పందన


ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్రకు అనూ హ్య స్పందన లభిస్తోందని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. వస్తున్నా మీ కోసం పాదయాత్ర వంద రోజులు ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న నేప«థ్యంలో పార్టీ శ్రే ణులతో కలిసి పట్టణంలో బైకు ర్యాలీ నిర్వహించారు. 103 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణ తెలుగు యువత ఉపాధ్యక్షుడు ఇట్టే శివనాగేశ్వరరావు ఆధ్వర్యంలో 103 కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం పెద్ద శివాలయంలో పూజలు జరిపారు.

ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిందన్నారు. ప్రస్తుత తరుణంలో ప్రజానీకం చంద్రబాబు పాలన కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ కరిముల్లా, షేక్ అబ్దుల్ రెహమాన్, తోట బ్రహ్మస్వాము లు, కూనల చంద్రబాబు, తూబాటి శ్రీ హరి, తేళ్ళ సుధీ ర్, నెల్లూరి సదాశివరా వు, బండారు నాగరా జు, తియ్యగూర కోటిరెడ్డి, అజయకుమార్ ఘోష్, ఆవుల గోపి, ఈవూరిబ్రహ్మానం దం, అంబటి సోం బాబు, విజయభాస్కరరెడ్డి, మాధవ సింగ్, మల్లిబాబు, బొల్లు రామకోటేశ్వరరావు పాల్గొన్నారు.