January 15, 2013

ఎమ్మెల్యే శ్రీధర్‌కు టీడీపీ నేతల పరామర్శ



విషజ్వరం సోకి అస్వస్థతకు గురైన పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ను తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. వారం నుంచి ఎమ్మెల్యే శ్రీధర్ అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ విషయం తెలుసుకొన్న పుల్లారావు ఆదివారం సాయంత్రం గుంటూరు జిల్లా కేంద్రంలోని ముత్యాలరెడ్డినగర్‌లో ఉన్న శ్రీధర్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చంద్రబాబు పాదయాత్ర గురించి కూడా ఈ సందర్భంగా శ్రీధర్‌తో పుల్లారావు చర్చించారు. ఎమ్మెల్యేని పరామర్శించిన వారిలో టీడీపీ జిల్లా నాయకులు డాక్టర్ శనక్కాయల అరుణ, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ముత్తినేని రాజేష్, ఎలుకా వీరాంజనేయులు, చిట్టాబత్తిన చిట్టిబాబు, సుకవాసి శ్రీనివాసరావు, పోతురాజు ఉమాదేవి, బత్తుల రమణమ్మ, కసుకుర్తి హన్మంతరావు తదితరులున్నారు.