January 15, 2013
బాబు అధికారంలోకి వస్తే పన్నుల్లేని పాలన
దేశంలో పరిపాలనాదక్షులైన నేతల వైపు ప్రజలు చూస్తున్నారని,
అంతర్జాతీయంగా పరిపాలనాధక్షుడిగా గుర్తింపు పొందిన చంద్రబాబుకు ఈసారి ప్రజలు బ్రహ్మర«థం పడతారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత దాడి
వీరభద్రరావు అన్నారు. కృష్ణాజిల్లాలో బాబు మీకోసం వస్తున్న పాదయాత్ర యావత్ రాష్ట్రంపై
ప్రభావం చూపుతుందని చెప్పారు. జగ్గయ్యపేటలో ఏలూరి కమలమ్మ ఐటీఐ కళాశాల ఆవరణలో
నిర్వహించిన జగ్గయ్యపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యఅతి«థిగా పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వ
హయాంలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయని, సుపరిపాలన అందించాల్సిన వారు స్వపరిపాలన చేసుకొన్నారని
ఆరోపించారు. గుజరాత్ ప్రజలు పరిపాలనా సామర్ధ్యం ఉన్న మోడిని గెలిపించిన విషయాన్ని గుర్తు
చేశారు.
అదే తరహాలో బాబును గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
చంద్రబాబు పాదయాత్రలో ఇస్తున్న హామీలన్నీ ఆచరణ సాధ్యమని, వివిధ రంగాల నిపుణులు నిర్ధారించాకే
హామీలు ఇస్తున్నారని చెప్పారు. ధరలు పెరుగుదలతో పాటు, గ్యాస్, ఎరువులు, పెట్రో ఉత్పత్తులపై
సబ్సిడీలు ఎత్తివేయటం, కరెంట్ చార్జీలు పెంచటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ రాక్షస పాలన
నుంచి విముక్తి కలిగించటమే లక్ష్యంగా చంద్రబాబు యాత్ర చేస్తున్నారని చెప్పారు. యాత్రకు కృష్ణా
జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు భారీగా వచ్చి బాబుకు ఆహ్వానం పలకాలని కోరారు.
Posted by
arjun
at
4:16 AM