January 10, 2013

నేనూ రైతు బిడ్డనై..!



 
మాజీ సీఎం చంద్రబాబునాయు డు నేను రైతు బిడ్డనే అంటూ రైతులు, కూలీలను ఆత్మీయంగా పలకరించారు. వస్తున్నా మీకోసంపాదయాత్ర కార్యక్రమంలో భాగంగా గురువారం బచ్చోడు నుంచి బంధంపల్లి , బీరోలు పాదయాత్ర చేసిన బాబుకు గ్రామాల సమీపంలోని పత్తి, మిరప చేలల్లోకి వెళ్లారు పంటల దిగుబడి వారికష్టాల గురించి అడిగితెలుసుకున్నారు.

కూలీల మొర:

పంటపొలాల్లో వ్యవసాయపనులు చేస్తున్న కూలీలు రోడ్లపైకి వచ్చి చంద్రబాబుతో సమస్యలపై మొరపెట్టుకన్నారు. బచ్చొడుకు చెందిన అంగిరేకుల ఉపేంద్ర, రామనబోయిన కలమ్మ, బొల్లం సాయమ్మ, గంధం చంద్రకళతో చంద్రబాబు మాట్లాడి వారి సమసయలు అడిగారు. కరెంట్ కొరతతో ప ంటలు నిలువునా ఎండిపోతున్నాయని వారు మొరపెట్టుకన్నారు. అధైర్యపడవద్దు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. కాంపాటి పుల్లయ్య అనే రైతుతో బాబు మాట్లాడి వారి సమస్యలను అడిగారు. విద్యుత్ కోతలతో 3 ఎకరాల్లో సాగుచేసిన మిర్చితోట ఎండిపోయిందని అని బోరున విలిపించారు. బంధంపల్లికి చెందిన భూక్యా మంచా మిర్చి కల్లాన్ని చంద్రబాబు సందర్శించి రైతుతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కరెంట్ సక్రమంగా రావడంలేదనని ఫలితంగా వేలాది రూపాయాలు పె ట్టుబడులు పెట్టి సాగుచేసిన తోట నిలువునా ఎండిపోయిందని నేనెలా బతకాల ని అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. తనకు అవకాశం ఇవ్వండి మీస మస్యలు పరిష్కరిస్తానని బాబు కోరరా. బంధంపల్లికిచ ఎందిన డ్వాక్రా కూలీలతో మాట్లాడి వారి సమస్లయు అడిగారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఏమికొనేటట్టు లేదని బాబు దృష్టికి తెచ్చారు. మీ సమస్యలు పరిష్కరిస్తానని తనకు ఒక్కసారిఅవకాశం ఇవ్వానలి కోరారు. ఒక వృద్దురాలు రూ.200లు పెన్షన్ వస్తుందని, ఆ పెన్షన్ ఏమూలకు సరిపోవడంలేదని కాళ్లకు దండంపెడుతూ బాబువద్ద మొరపెట్టుకుంది. త్వరలోనే మంచిరోజులు వస్తాయని బాబు ఆమెకు భరోసా ఇచ్చారు.