January 10, 2013
అన్నగారి చరితర పునరావృతం కానుంది
లోకేష్ ట్వీట్
చంద్రబాబు పాదయాత్ర వంద రోజులకు చేరుకోవడంతో
ఆయన తనయుడు నారా లోకేష్ ట్విట్టర్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "చరిత్ర పునరావృతం
కానుంది. ప్రజలు బాధల్లో ఉన్నారు. ఆశలు అడుగంటాయి. 30 ఏళ్ల కిందట ఇదే రోజున 'అన్న'గారు
అధికార పగ్గాలు చేపట్టారు. వస్తున్నా మీ కోసం పాదయాత్ర ద్వారా నాన్న (చంద్రబాబు) కూడా
పార్టీని అధికారంలోకి తెస్తారు'' అని ట్వీట్ చేశారు. ముప్పయ్యేళ్ల కింద (1983 జనవరి
9న) ఎన్టీఆర్ నేతృత్వంలోని టీడీపీ అధికారం చేపట్టిన విషయాన్ని లోకేష్ ప్రముఖంగా ప్రస్తావిస్తూ..
నాడు టీడీపీ స్థాపనకు ముందు ఉన్న పరిస్థితులే నేడు కూడా రాష్ట్రంలో కనిపిస్తున్నాయన్నారు.
Posted by
arjun
at
5:59 AM