January 10, 2013
రైల్వే ధర పెంపును ఉపసంహరించాలి: చంద్రబాబు
కేంద్రం రైల్వే చార్జీలను పెంచి ప్రజలపై భారం
మోపడం దారుణమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని
డిమాండ్ చేశారు. ఆదాయం పెంచుకునేందు కు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సింది పోయి
ప్రజలపై భారం మోపడం సమంజసం కాదన్నారు. లక్షల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణాలు జరుగుతుం
టే, అవినీతి పరులను శిక్షించి ఆ సొమ్మును రికవరీ చేసి ప్రజా సంక్షేమానికి వినియోగించకుండా
కేంద్రం సామాన్యులనే లక్ష్యంగా చేసుకుంటోందని ధ్వజమెత్తారు. ఇప్పటికే తొమ్మిదేళ్లలో
28 సార్లు పెట్రోల్/ డీజిల్ ధరలను పెంచి రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగేలా చేసిందని
ఆక్షేపించారు.
Posted by
arjun
at
5:24 AM