December 15, 2012

అవినీతిని రూపుమాపుతేనే పేదరికం అంతం..

భారతదేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే మొట్ట మొదటగా అవినీతి ని ర్మూలన జరుగాలని పాదయాత్రలో చంద్రబాబు పేర్కొన్నారు. ఖానాపూర్ మండలంలోని మంచిర్యాల చౌరస్తా వద్ద విద్యార్థులు, యువకులతో ముఖాముఖి నిర్వహించారు...
చంద్రబాబు: అవినీతి నిర్మూనల జ రగాలంటే మొట్టమొదలు ఏం చేయాలి చెప్పండి.

విద్యార్థి: ఎక్కడికెళ్లినా డబ్బులివ్వని దే అధికారులు పనిచేయటం లేదు. అ వినీతి బాగా పెరిగింది. అవినీతి తగ్గాలంటే మీరు అధికారంలోకి రావాలి.చంద్రబాబు: టీడీపీ హయంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించాను. దేశం అవినీతి రహిత దేశమైతే పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. విద్యార్థులు, యువకులు అవినీతిని ప్రోత్సహించకుండా తిరగబడితే సాధ్యమవుతుంది.

సలీమ్‌ఖాన్ యువకుడు: సార్ ప్రస్తుతం రాష్ట్రం తండ్రిలేని బిడ్డగా ఉం ది. మాకు సుస్థిర పరిపాలన కావాలి.

చంద్రబాబు: నిజమే మనం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో యువకులు, పిల్లలు ఎక్కువ గా ఉన్నారు. 25.2 శాతం సరాసరి వ యస్సు భారతదేశంలో ఉండగా, చైనా దేశంలో 37 సంవత్సరాల సరాసరి వయస్సు ఉందని, మరో 20 ఏళ్లలో వారు మరింత అభివృద్ధి చెందుతారని, మనదేశం ముందుకు వెళ్లాలంటే ప్రమాదమైన అవినీతిని ఎదుర్కోవాలి.

విద్యార్థి: మీరు గెలిచిన తరువాత కాంగ్రెస్ వారిలాగా చేస్తే ఎలా మరీ.చంద్రబాబు: ఎన్నో అభివృద్ధి పనులు చేశాను. అప్పటికీ ఇంకా నువ్వు పుట్టలేదు. చెప్పింది చేసి చూపిస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇంటి పైకప్పులు కూడా ఉండవు. ఉద్యోగాలు రావు. రాజీవ్ యువశక్తి తుంగలో తొ క్కారు. ఒక్క వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి వేయి లారీల డబ్బులు దోచుకు తి న్నా డు. అందులో ఒక్కలారీ ఖానాపూర్‌కు ఇస్తే అందరూ ధనవంతులవుతారు.విద్యార్థి: సార్ మీరు అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థుల సమస్య లు పరిష్కరిస్తారా..స్కాలర్‌షిప్ ఇస్తారా.చంద్రాబు: గతంలో మాదిరిగానే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యతో పాటు స్కాలర్ షిప్..రీఈంబర్స్‌మెంట్ ఇచ్చి చదివిస్తాం. ఉద్యోగాలు కల్పిస్తాం.