December 15, 2012

మంచిర్యాలను జిల్లాగా ఏర్పాటు చేస్తా


నిర్మల్/ఖానాపూర్/మామడ/కడెం/సారంగాపూర్/నిర్మల్అర్బన్: టీ డీపీ అధికారంలోకి వస్తే మంచిర్యాల ను జిల్లాగా ఏర్పాటు చేస్తానని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నా రు. శుక్రవారం రాత్రి వస్తున్నా ... మీకో సం పాదయాత్రలో భాగంగా ఖానాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జి ల్లాను అంచలంచెలుగా అభివృద్ధి చేసి న ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. నిర్మల్ కొయ్యబొమ్మల కళాకారులకు ఆదరణ కరువైందని, నిర్మల్ కొయ్యబొమ్మల కళాకారులను అన్ని విధాల ఆదుకుంటామన్నారు. బీడీ కార్మికుల సమస్యల పరిష్కారిస్తూ, వారి సౌకర్యార్థం నిర్మల్ పట్టణంలో పీఎఫ్ కార్యాలయా న్ని ఏర్పాటు చేస్తామన్నారు. కేసీఆర్‌కు తెలంగాణలోని ప్రజల సమస్యలు పట్టవని, కేవలం ఫౌంహౌస్‌లో కుంభకర్ణుడిలా నిద్రపోవడానికే పరిమితమై ఆరు నెలలకోసారి లేస్తాడని విమర్శించారు. కేసీఆర్ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు బీడీ కార్మికుల పొట్ట లు కొట్టడానికి బీడీ కట్టలపై పుర్రె గు ర్తు, శవం గుర్తును ముద్రించి బీడీ కార్మికులకు తీరని అన్యాయం చేశాడని పే ర్కొన్నారు.

సామాజిక న్యాయం అం టూ సామాజిక ద్రోహం చేసి మంత్రి పదవి కోసమే చిరంజీవి కాంగ్రెస్‌లో వి లీనమయ్యారన్నారు. డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామన్నారు. తె లంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తాము ఎప్పుడూ కట్టుబడి ఉన్నామని, కేంద్ర ప్రభుత్వానికి లేఖను సైతం సమర్పించామని గుర్తుచేశారు. ఈ కార్యక్రమం లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మాండవ వెంకటేశ్వర్‌రావు, జిల్లా ఎం ప రాథోడ్ రమేష్, జిల్లా అధ్యక్షుడు గె డం నగేష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు లోలం శ్యామ్‌సుందర్, అబ్దుల్‌కలాం, మాజీ జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే పాటి సుభద్ర, చంద్రబాబు తనయుడు లోకేష్, నా యకులు భూషణ్‌రెడ్డి, రితీష్‌రాథోడ్ ని ర్మల్, ముథోల్, ఆదిలాబాద్ నియోజక వర్గ ఇన్‌చార్జిలు బాబర్, నగర్ నారాయణరెడ్డి, శంకర్, స్థానిక మాజీ స ర్పంచ్ శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ రా మునాయక్, మాజీ ఎంపీపీ సల్ల రామేశ్వర్‌రెడ్డి, నాయకులు రాజేంధర్, టీడీ పీ మండల పార్టీ అధ్యక్షులు వెంకగౌడ్, రాజు, గంగన్న, ప్రదీప్ ఉన్నారు.

పాదయాత్రకు తరలివచ్చిన ప్రజలు..ఖానాపూర్ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన చంద్రబాబు పాదయాత్ర కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఖానాపూర్ పట్టణంతో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. జిల్లాను విడిచి వెళ్లాలంటే ాధగా ఉంది..ఆదిలాబాద్ జిల్లాను విడిచి వెళ్లాలంటే తనకు ఎంతో బాధగా ఉందని చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో ఆదిలాబాద్ జిల్లాలో మరో నా లు కిలో మీటర్లు దూరంలో పాదయాత్రను ముగించుకొని కరీంనగర్ వెళ్తున్న సందర్భంగా ఆయన ఈ విధంగా మా ట్లాడారు.

తాను తొమ్మిది రోజుల పాదయాత్రలో బాసర నుంచి మొదలైన పా దయాత్ర చివరన ఖానాపూర్ మం డలం బాదనకుర్తి వద్ద ముగుస్తుందని, ఈ జిల్లాను మరిచిపోనన్నారు. ముస్లింల సమస్యలపరిష్కారం కోసం కృషి చేస్తా...ముస్లిం మైనార్టీల సమస్యల పరిష్కారం కృషి చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం ఖానాపూర్ పట్టణంలోని మదర్సాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్ర బాబు నాయుడు మాట్లాడారు. ముస్లింలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఆర్థిక, విద్య, రాజకీయంగా అన్నింట్లో ప్రాధాన్యత కల్పిస్తానన్నారు.

పార్టీకి ప్రాణం పోసిన 'బాబు' పాదయాత్ర..!నిర్మల్: వస్తున్నా... మీకోసం పేరిట చంద్రబాబునాయుడు నిర్వహించిన పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి ప్రా ణం పోసింది. గత కొద్ది రోజుల నుం చి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీకి బాబు పాదయాత్ర ద్వా రా కొత్త జవసత్వాలు నిండాయంటున్నారు. నేటితో పాదయాత్ర ముగుస్తుండడంతో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతం గత ఐదేళ్ల నుంచి ప్రతికూలతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 2009 ఎన్నికల్లో జిల్లాలోని 10 అసెంబ్లీ స్థా నాలకు గాను మిత్రపక్షాలతో కలిసి తొ మ్మిది స్థానాలు గెలుచుకున్న టీడీపీ క్ర మంగా తెలంగాణ వాదంతో పాటు పా ర్టీ నుంచి నేతల నిష్క్రమణలాంటి అం శాలతో సంక్షోభానికి గురవుతూ వస్తున్నది.

దీంతో పాటు ఆ పార్టీకి చెందిన ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాలచారి పా ర్టీని వీడి అధినేత చంద్రబాబును విమర్శించడం, ఈయనతో పాటు నిర్మల్ కు చెందిన సత్యనారాయణగౌడ్ తదితర సీనియర్ నేతలంతా టీఆర్ఎస్‌లో చేరడంలాంటి పరిణామాలన్ని టీడీపీ కొంత మేరకు బలహీనపడేందుకు దో హదపడ్డాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో దేశం అధినేత చంద్రబాబు నాయుడు వస్తున్నా.. మీకోసం పేరిట నిర్వహించిన పాదయాత్రకు జనం బ్ర హ్మరథం పట్టారు. బాసర నుంచి బాదనకుర్తి వరకు ఆయా మూడు నియోజ క వర్గాల్లో పాదయాత్రలు నిర్వహించి పార్టీకి ప్రాణం పోశారు. జిల్లాలోని అ న్ని నియోజక వర్గాల నుంచి టీడీపీ కా ర్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రతిపల్లెలో ప్రజలు చంద్రబాబునాయుడుకు ఘ నంగా స్వాగతం పలికి ఆయనను ఆదరించారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే అమలుచేసే కార్యక్రమాలను ఆయన హామీల రూపంలో వివరించా రు.

చివరి రోజైన శుక్రవారం ఆయన గి రిజన నియోజక వర్గమైన ఖానాపూర్ లో పాదయాత్ర నిర్వహించి ప్రజలతో మమేకమయ్యారు. పది రోజుల పాటు చంద్రబాబు నిర్వహించిన పాదయాత్ర తో తెలుగుదేశం పార్టీ నాయకులు, కా ర్యకర్తల్లో సమరోత్సాహం నెలకొంది. చంద్రబాబు నాయుడు ఖానాపూర్ నుంచి బాదనకుర్తి మీదుగా కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి నియోజక వర్గంలోకి రాత్రి ప్రవేశించారు.